మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకుని 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ,అయిన ..... మనం మాత్రం ఇక్కడే ఉన్నాం .కుల పిచ్చిని కాలరాద్దామన్న అంబేద్కర్ విగ్రహాన్ని చిన్నబిన్నం చేసేంత పరిణితి వచ్చింది మనలో ,రాకెట్ యుగం లో కి ఎంట్రీ ఇచ్చిన రాతి యుగపు మన అలవాట్లు జేబుల్లో పెట్టుకు తిరుగుతున్నాం అనటానికి ఈ విగ్రహ ద్వంసం ఒక్కటే హేతువు కాదు .
భానిసత్వం సంకెళ్ళను పెల్లగించుకున్నామని ,స్వేచ్చను పొందామని,భారతమాత వ్యక్తిత్వం నిలబెట్టుకున్నం అని సగర్వంగా పాడుకోవడానికి చాలానే దేశ భక్తి గీతలు ఉన్నాయ్ ,అ స్వేచ్చ అనబడే మానవీయ అవసరం ఎందరి దగ్గర బద్రంగా ఉంది ,అండమాన్ దీవులలోని జడావ తెగలను నగ్నంగా నిలుచోబట్టి డాన్సు లు వెయిచ్చి, అందులోని వినోదాన్ని వెతుక్కుని పసందైన పర్యాటకులు మన భారతియులే ,అ విధంగా సాటి మనిషిని భారతియుడు ఎ విధంగా చూస్తున్నాడు అనేదానికి ఇదొక నిలువెత్తు సాపత్యం .మనల్ని మనం వినోద పరికరాలుగా ప్రెసెంట్ చేసుకొని ,ఆనంద పడిపోతు పనిలో పనిగా ,విదేశీ పర్యాటకుల నుండి సొమ్ములు కూడా దండుకుంటన్నాం .ఒరిస్సా లో ఒక తెగ వాళ్ళని బ్రిటన్ నుండి వచ్చే పర్యాటకుల కోసం ,వీళ్ళని నగ్నంగా నిల్చో బెట్టి parade చేసి చూపించడం tourist కంపని ఇస్తున్న స్పెషల్ package.ఇందుకోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన వీళ్ళ తెగిoపుకు గర్వపడాల ,సిగ్గుపడాల .అడవుల్లో పుట్టి,అడవుల్లో పెరుగుతున్న ఈ తెగ వాళ్ళు కూడా మన సర్వ సత్తాక గణతంత్ర దేశానికి చెందిన సగటు భారతీయులే .నాగరికత తెలియకపోవడం వాళ్ళ తప్పుకాదు ,కనీసం బట్టలు లేకుండా తిరగాకుడదు అన్న జ్ఞానం లేకపోవడం వాళ్ళు చేసిన నేరం కాదు ,కడుపు నింపుకోవడం వాళ్ళు ఇలా చేయాల్సి రావడం వాళ్ళ కర్మ కనీ ,వాటిని ఎగోదోసిన పాపం నేటి భారతీయులుగా మనది కాదా.
భానిసత్వం సంకెళ్ళను పెల్లగించుకున్నామని ,స్వేచ్చను పొందామని,భారతమాత వ్యక్తిత్వం నిలబెట్టుకున్నం అని సగర్వంగా పాడుకోవడానికి చాలానే దేశ భక్తి గీతలు ఉన్నాయ్ ,అ స్వేచ్చ అనబడే మానవీయ అవసరం ఎందరి దగ్గర బద్రంగా ఉంది ,అండమాన్ దీవులలోని జడావ తెగలను నగ్నంగా నిలుచోబట్టి డాన్సు లు వెయిచ్చి, అందులోని వినోదాన్ని వెతుక్కుని పసందైన పర్యాటకులు మన భారతియులే ,అ విధంగా సాటి మనిషిని భారతియుడు ఎ విధంగా చూస్తున్నాడు అనేదానికి ఇదొక నిలువెత్తు సాపత్యం .మనల్ని మనం వినోద పరికరాలుగా ప్రెసెంట్ చేసుకొని ,ఆనంద పడిపోతు పనిలో పనిగా ,విదేశీ పర్యాటకుల నుండి సొమ్ములు కూడా దండుకుంటన్నాం .ఒరిస్సా లో ఒక తెగ వాళ్ళని బ్రిటన్ నుండి వచ్చే పర్యాటకుల కోసం ,వీళ్ళని నగ్నంగా నిల్చో బెట్టి parade చేసి చూపించడం tourist కంపని ఇస్తున్న స్పెషల్ package.ఇందుకోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన వీళ్ళ తెగిoపుకు గర్వపడాల ,సిగ్గుపడాల .అడవుల్లో పుట్టి,అడవుల్లో పెరుగుతున్న ఈ తెగ వాళ్ళు కూడా మన సర్వ సత్తాక గణతంత్ర దేశానికి చెందిన సగటు భారతీయులే .నాగరికత తెలియకపోవడం వాళ్ళ తప్పుకాదు ,కనీసం బట్టలు లేకుండా తిరగాకుడదు అన్న జ్ఞానం లేకపోవడం వాళ్ళు చేసిన నేరం కాదు ,కడుపు నింపుకోవడం వాళ్ళు ఇలా చేయాల్సి రావడం వాళ్ళ కర్మ కనీ ,వాటిని ఎగోదోసిన పాపం నేటి భారతీయులుగా మనది కాదా.
ఏమి తెలియని వాళ్ళంటే వదిలేద్దాం ,ఎంతో నాగరికత సంపాదించినా మనం ,కుల మత బాషలికి అతీతంగా ఉన్న మన దేశం లో గడిచిన 62 సంవత్సరాలలో 482 చోట్ల మత పరమైన అల్లర్లు ,విద్వంసాలు ,బాంబు పేలుళ్లు జరిగితే ,13 వేల మంది నెత్తురు చిందించి నెల కులినట్టు ఆధారాలు ఉన్నాయ్ .లక్ష 82 వేల కోట్లు దాటిన రక్షణ బడ్జెట్ కూడా ... మనకు కనీస బద్రత కల్పించాలేకపోతుంది...
ఇప్పటికి దేశం లో 53 కోట్ల మందికి ఆకలి అనేది తీరని కోరిక ,ఒక్క పూట తిండి తో సరిపెట్టుకుంటున్న వాళ్ళు ఇంకెందరో ,ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూ ,పేదవాడు మాత్రం అలాగే ఉండిపోవటం మనం ఇప్పటికి చూస్తున్నాం ,ఆ పేద వాడు ఉన్నదీ కూడా ఈ మన గణతంత్ర దేశం లోనే .60 సంవత్సరాలుగ డెవలప్ అవుతున్నాం అంటున్నాం కానీ ఎప్పటికి డెవలప్ అయ్యం అని చెప్పుకుంటాం తెలియదు .
మనకంటూ మనం ఉపయోగించుకునే ఓటు హక్కు కూడా డబ్బులకు ,మందు బాటిల్ లకు అమ్ముకున్తున్నది కూడా మనోబోటి సగటు భారతియుడే .ఎన్నికల సమయం అంటే ఆహార పొట్లాలు ,మందు బాటిల్ లు ,డబ్బులు పంచడం అనే ఒక విపరీతమైన ట్రేడ్ నడుస్తుంది కూడా మన ఈ గణతంత్ర దేశం లోనే .మనం ముందుకు నడుస్తున్నామ లేక వెనక్కు నడుస్తున్నామ అనే సందేహం ఎ గణాంకాలు చూసాక మనల్ని దెప్పి పొడుస్తుంది .260 central labs,300 universitilu,20 వేల college లు , 30 వేల మంది సైంటిస్ట్ లు ఉన్న పుష్టి కరమైన దేశం గ ఇండియా కు పేరుంది కాని ,సైన్సు లో మాత్రం మనకు నోబెల్ సాదించి పెట్టింది cv raman అనే ఒకే ఒక్క సైంటిస్ట్.ఇంత మంది ఉన్న ఎందుకు తెచ్చుకో లేక పోతున్నాం ? మన ఇండియా లో ఎక్కడ లేనంతగా నల్లదనం మనం పోగు చేసుకున్నాం ,అవినీతి బాగా అలవాటు పడిపోయిన మనం ఎన్నికల సమయం లో నాయకులూ ఇచ్చే హామీలతో సోమరి పోతులుగా మరిపోతున్నాం . అన్ని మనకి తెలిసి చేస్తున్న మనకెందుకు అని అనుకువడం మన దేశం లో ఉన్న వ్యక్తుల లక్షణం .దేశం ఎలా అయిపోయిన మనం మాత్రం బాగుంటే సరిపోతుంది కదా అనే గణతంత్ర దేశం లో ఉన్నాం .రూపాయ్ విలువ ఎప్పుడు పడిపోతుందో అని బయపెడుతూ ఉంటె ,ఎప్పటికప్పుడు పరిగిపోతు ఉండే కుంబ కోణాలు మనల్ని ఇంకా ఇలానే ఉండేలా చేస్తున్నాయ్ ,అందుకే మనం ఇంకా ఇలానే ఉన్నాం ,దొరికిన వాళ్ళను జైలు లో పెట్టి వాళ్ళను మేపడం తప్ప మనం చేయ గలిగింది ఏమి లేదు ,కనీసం 2020 కన్నా ఇండియా అబివ్రుది చెందిన దేశం గ మనం చూస్తామ ,ఏమో అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేమ?
కనీసం మన ఓటు హక్కు నైన మనం సద్వినియోగం చేసుకుందాం ,మనవంతు బాద్యత గ సాటివాడికి సహాయపడుదాం .ఎ విషయం ఐన మనకెందుకు అని కాకుండా మనకోసం అన్నట్టుగా అలోచ్చిద్దాం ,మన దేశాన్ని బావి తరాలకు ఒక ఆదర్శంగా తీర్చి దిద్దడం లో మన వంతు బాద్యత నిర్వర్తిద్దాం .